ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారంటూ...
- June 29, 2018
బంజారాహిల్స్లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్లో ఉన్న యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మూడురోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సమీరా అనే మహిళ దుబాయ్ నుంచి వచ్చి నగరంలో ఉంటుంది. ఈ సమయంలోనే ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్తో గొడవలు మొదలు అయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సమీరా పబ్లో ఉండగా ఆమెపై ఫిరోజ్ దాడి చేసి కిడ్నాప్ చేశాడు. అతని చెర నుంచి తప్పించుకున్న సమీరా.. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేపింది. బాత్రూమ్లో తననను బంధించి దారుణంగా హింసించారని ఒంటిపై దుస్తులు తీసేసి తనపై బ్లేడ్లతో కోశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!