ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతాయి: టర్కీ
- June 29, 2018
ఇరాన్ నుండి తాము క్రూడాయిల్ దిగుమతులను ఇకపై కూడా కొనసాగిస్తామని టర్కీ స్పష్టం చేసింది. నవంబర్ 4 నుండి తాము విధించిన తాజా ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను నిలిపివేయాలని అమెరికా విదేశాంగశాఖ తన మిత్రదేశాలకు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టర్కీ ఆర్థిక మంత్రి నిహాత్ జెబికీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తీసుకున్న నిర్ణయాలకు తాము బద్ధులం కాలేమని స్పష్టం చేశారు. తాము ఐరాస నిర్ణయాలను గౌరవించి వాటిని అనుసరిస్తామని, వీటితో పాటు తమ జాతీయ ప్రయోజనాలకు అనువైన నిర్ణయాలను తీసుకుంటామని ఆయన వివరించారు. తమ మిత్ర దేశం ఇరాన్ అన్యాయమైన ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోకుండా తాము దృష్టి పెడతామన్నారు. ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను నిలిపివేయాలంటూ అమెరికా చేసిన సూచనను బేఖాతరు చేస్తూ జపాన్, ద.కొరియా, భారత్ వంటి దేశాలతో పాటు ఐరోపా కూటమి కూడా తాము ఇరాన్ దిగుమతులను కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







