ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు కొనసాగుతాయి: టర్కీ
- June 29, 2018
ఇరాన్ నుండి తాము క్రూడాయిల్ దిగుమతులను ఇకపై కూడా కొనసాగిస్తామని టర్కీ స్పష్టం చేసింది. నవంబర్ 4 నుండి తాము విధించిన తాజా ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను నిలిపివేయాలని అమెరికా విదేశాంగశాఖ తన మిత్రదేశాలకు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టర్కీ ఆర్థిక మంత్రి నిహాత్ జెబికీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా తీసుకున్న నిర్ణయాలకు తాము బద్ధులం కాలేమని స్పష్టం చేశారు. తాము ఐరాస నిర్ణయాలను గౌరవించి వాటిని అనుసరిస్తామని, వీటితో పాటు తమ జాతీయ ప్రయోజనాలకు అనువైన నిర్ణయాలను తీసుకుంటామని ఆయన వివరించారు. తమ మిత్ర దేశం ఇరాన్ అన్యాయమైన ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోకుండా తాము దృష్టి పెడతామన్నారు. ఇరాన్ నుండి క్రూడాయిల్ దిగుమతులను నిలిపివేయాలంటూ అమెరికా చేసిన సూచనను బేఖాతరు చేస్తూ జపాన్, ద.కొరియా, భారత్ వంటి దేశాలతో పాటు ఐరోపా కూటమి కూడా తాము ఇరాన్ దిగుమతులను కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







