దుబాయ్ మెట్రో రూట్ 2020 టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి
- June 30, 2018
ఎక్స్పో 2020 సైట్ని కనెక్ట్ చేసే మెట్రో రైల్ రూట్కి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమైన టన్నెలింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. 3.2 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదిలో ఈ టన్నెల్ పనులు ప్రారంభమయ్యాయి. ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డైరెక్టర్ జనరల్, ఛైర్మన్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, జెయింట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ 'అల్ వుగెషా ఎక్స్పో 2020' ద్వారా ఈ డ్రిల్లింగ్ పనులు చేసినట్లు చెప్పారు. ఈ మెషీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనీ, ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ల్యాండ్ లేయర్స్పై వుండకుండా పనిచేస్తుందని వివరించారాయన. రూట్ 2020 రెడ్ లైన్ ఎక్స్టెన్షన్. నఖీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ లైన్ విస్తరించి వుంటుంది. 11 కిలోమీటర్ల లాంగ్ వయాడక్ట్, 4 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ రైల్ ట్రాక్ ఇది. మొత్తం ఏడు స్టేషన్లు వుంటాయి. వీటిలో ఐదు ఎలివేటెడ్ మరియు రెండు అండర్గ్రౌండ్ స్టేషన్స్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







