దుబాయ్ మెట్రో రూట్ 2020 టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి
- June 30, 2018
ఎక్స్పో 2020 సైట్ని కనెక్ట్ చేసే మెట్రో రైల్ రూట్కి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమైన టన్నెలింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. 3.2 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదిలో ఈ టన్నెల్ పనులు ప్రారంభమయ్యాయి. ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డైరెక్టర్ జనరల్, ఛైర్మన్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, జెయింట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ 'అల్ వుగెషా ఎక్స్పో 2020' ద్వారా ఈ డ్రిల్లింగ్ పనులు చేసినట్లు చెప్పారు. ఈ మెషీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనీ, ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ల్యాండ్ లేయర్స్పై వుండకుండా పనిచేస్తుందని వివరించారాయన. రూట్ 2020 రెడ్ లైన్ ఎక్స్టెన్షన్. నఖీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ లైన్ విస్తరించి వుంటుంది. 11 కిలోమీటర్ల లాంగ్ వయాడక్ట్, 4 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ రైల్ ట్రాక్ ఇది. మొత్తం ఏడు స్టేషన్లు వుంటాయి. వీటిలో ఐదు ఎలివేటెడ్ మరియు రెండు అండర్గ్రౌండ్ స్టేషన్స్.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







