దుబాయ్ మెట్రో రూట్ 2020 టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి
- June 30, 2018
ఎక్స్పో 2020 సైట్ని కనెక్ట్ చేసే మెట్రో రైల్ రూట్కి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్యమైన టన్నెలింగ్ వర్క్స్ పూర్తయ్యాయి. 3.2 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదిలో ఈ టన్నెల్ పనులు ప్రారంభమయ్యాయి. ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డైరెక్టర్ జనరల్, ఛైర్మన్ మట్టర్ అల్ తాయెర్ మాట్లాడుతూ, జెయింట్ టన్నెల్ బోరింగ్ మెషీన్ 'అల్ వుగెషా ఎక్స్పో 2020' ద్వారా ఈ డ్రిల్లింగ్ పనులు చేసినట్లు చెప్పారు. ఈ మెషీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనీ, ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ల్యాండ్ లేయర్స్పై వుండకుండా పనిచేస్తుందని వివరించారాయన. రూట్ 2020 రెడ్ లైన్ ఎక్స్టెన్షన్. నఖీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ లైన్ విస్తరించి వుంటుంది. 11 కిలోమీటర్ల లాంగ్ వయాడక్ట్, 4 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ రైల్ ట్రాక్ ఇది. మొత్తం ఏడు స్టేషన్లు వుంటాయి. వీటిలో ఐదు ఎలివేటెడ్ మరియు రెండు అండర్గ్రౌండ్ స్టేషన్స్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







