24 గంటల్లో 22 వేల ఎకరాలు బుగ్గిపాలు
- July 02, 2018
లాస్ఏంజెల్స్: ఉత్తర కేలిఫోర్నియాలోని యోలో కౌంటీలో శనివారం మధ్యాహ్నం రగులుకున్న కార్చిచ్చు ఆదివారం ఉదయం నాటికి దాదాపు 22 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుగ్గిపాలు చేసింది. దీనితో అక్కడ నివశిస్తున్న వేలాది మంది ప్రజలను బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. శనివారం మధ్య్నాం యోలో కౌంటీకి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆరంభమైన ఈ కార్చిచ్చు వేగంగా విస్తరించటంతో ఆ ప్రాంతంలో వేడిగాలులు, విపరీతమైన వేడీ వ్యాపించాయని కాలిఫోర్నియా ఫైర్సర్వీస్ (కాల్ఫైర్) అధికారులు చెప్పారు. గిండా ప్రాంతంలోని రగులుకున్న ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి మొత్తం నివాసితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు 29 మంది అగ్నిమాపక సిబ్బంది, 110 అగ్నిమాపక శకటాలు, 12 హెలీకాప్టర్లు సమిష్టిగా ప్రయత్నిస్తున్నాయని కాల్ఫైర్ సర్వీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







