అలనాటి నటుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
- July 02, 2018
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నరకు ఆయన హెలికాప్టర్ లో సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో పెద్దపాడు మండలం వట్లూరులో ఎస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా ఆయన మేనల్లుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏర్పాటు చేసిన ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. తిరిగి ఏలూరు చేరుకొని పవర్పేటలో ఎన్జీవో హోం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు జిల్లా ప్రధానాసుపత్రిలో తలసేమియా వ్యాధి నివారణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ తర్వాత ఇండోర్ మైదానంలో జిల్లా సహకార బ్యాంక్ శత వసంతోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులతో పాటు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఏలూరుకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, నాలుగు ఏఆర్ స్పెషల్ ప్లాటూన్లు మొత్తం 1500 మంది పోలీసులు సీఎం బందోబస్తులో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







