అలనాటి నటుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
- July 02, 2018
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరులో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నరకు ఆయన హెలికాప్టర్ లో సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో పెద్దపాడు మండలం వట్లూరులో ఎస్వీ రంగారావు శత జయంతి సందర్భంగా ఆయన మేనల్లుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏర్పాటు చేసిన ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. తిరిగి ఏలూరు చేరుకొని పవర్పేటలో ఎన్జీవో హోం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు జిల్లా ప్రధానాసుపత్రిలో తలసేమియా వ్యాధి నివారణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ తర్వాత ఇండోర్ మైదానంలో జిల్లా సహకార బ్యాంక్ శత వసంతోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.చంద్రబాబు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులతో పాటు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఏలూరుకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, నాలుగు ఏఆర్ స్పెషల్ ప్లాటూన్లు మొత్తం 1500 మంది పోలీసులు సీఎం బందోబస్తులో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







