మానససరోవర్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం
- July 02, 2018
కైలాస మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న విజయవాడ చిట్టినగర్కు చెందిన 16 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండో-టిబెట్ సరిహద్దులో మంచు తుఫాన్ కారణంగా యాత్రికులు ఎక్కడికీ కదలేని పరిస్థితి ఉందని ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్కు నేపాల్ భారతీయ ఎంబసీ కార్యాలయం తెలిపింది. తుఫాన్ తగ్గిన వెంటనే యాత్రికులను తిరిగి పంపుతామని పేర్కొంది. యాత్రికులకు వైద్య సదుపాయాలు అందజేస్తున్నామని నేపాల్ భారతీయ ఎంబసీ కార్యాలయం తెలిపింది.
మానససరోవర్ యాత్రకు వెళ్లిన 16 మంది యాత్రికులు ఇండో-టిబెట్ సరిహద్దులో మంచు తుఫాన్ రావడంతో అక్కడే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక...వెనక్కి రాలేక యాత్రికుల అవస్థలకు గురయ్యారు. విషయం తెలిసిన కలెక్టర్ లక్ష్మీకాంతం బాధితులతో ఫోన్లో మాట్లాడారు. యాత్రికులకు మందులు, ఆహారం సరఫరా చేయాలని ఏపీ భవన్ అధికారులను కోరారు. అయితే తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు నేపాల్ భారతీయ ఎంబసీ ప్రకటించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







