ముంచెత్తుతున్న భారీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్తం
- July 03, 2018
ముంబైలో వానలు మరోసారి విజృంభించాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. మాతుంగ కింగ్ సర్కిల్ దగ్గర రోడ్లపై నీళ్లు మోకాలి లోతు వరకు చేరుకున్నాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నీళ్లలో నిలిచిపోయి మొరాయించాయి.
ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా, శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. రోడ్లపై నిలిచిన వాననీటిని తొలగించేందుకు ముంబై కార్పొరేషన్ సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







