ముంచెత్తుతున్న భారీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్తం
- July 03, 2018
ముంబైలో వానలు మరోసారి విజృంభించాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. మాతుంగ కింగ్ సర్కిల్ దగ్గర రోడ్లపై నీళ్లు మోకాలి లోతు వరకు చేరుకున్నాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు నీళ్లలో నిలిచిపోయి మొరాయించాయి.
ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా, శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. రోడ్లపై నిలిచిన వాననీటిని తొలగించేందుకు ముంబై కార్పొరేషన్ సహాయక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







