వరంగల్లో భారీ అగ్నిప్రమాదం
- July 04, 2018
వరంగల్లో భారీ అగ్నిప్రమాదం బాణసంచా గోదాములో చెలరేగిన మంటలు పదిమంది కార్మికుల సజీవ దహనం మృతుల సంఖ్య పెరిగే అవకాశం? కోటిలింగాల: వరంగల్ కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్స్క్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. పదిమంది కార్మికులు మంటల్లో సజీవ దహనం కాగా.. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. వారు గోదాంలోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని వెంటనే ప్రమాదస్థలానికి పరుగులు తీశారు. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







