స్వామీజీని ఉరితీశారు...
- July 05, 2018
జపాన్లో ఆమ్ షిన్రికియో కల్ట్ నేత షోకో అసాహారా, ఆయన ఆరుగురు అనుచరులను ఈరోజు ఉరితీశారు. ఈ విషయాన్ని జపనీస్ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరో 12 మంది ఆమ్ సిన్రికియో కల్ట్ సభ్యులకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. వీరందరికీ జనవరిలో ఉరిశిక్షలు ఖరారు చేశారు. 1995లో టోక్యోలోని సబ్వేలో కార్లలో విషవాయువు వదిలిన కేసులో వీరిని ఉరితీశారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందగా, 6 వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. జపనీస్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కల్ట్ నేత అసాహారా ఉరిని నిర్ధారించారు.
1995 సబ్వే దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్లాస్టిక్ సంచులలో విషవాయువు నింపి... రైలు, కార్లలో విడుదల చేయడంతో 13 మంది మృతిచెందగా... వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 1984లో స్థాపించబడిన ఆమ్ షిన్రికియో కల్ట్... అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లను కూడా పొందింది. జపాన్తో పాటు రష్యాలోనూ ఈ ఆమ్ షిన్రికియో కల్ట్ను ఆచరించేవారున్నారుఅయితే ఈ కల్ట్ మూడు గ్రూపులుగా విడిపోయింది. అనంతరం ప్రభుత్వం నిషేధించింది. అసాహారాను ఉరి తీయడంతో ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు... వారి ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







