ఇరాన్:టెహ్రాన్పై దాడి కేసులో 8 మంది ఉగ్రవాదులకు ఉరి
- July 07, 2018
టెహ్రాన్ : ఇరాన్ పార్లమెంట్ పైన, ఇరాన్ మత నాయకుడు రోహుల్లా ఖోమేనీ మసోలియంóపైన 2017లో దాడి జరిపిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపునకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులను శనివారం ఉరి తీసినట్లు ఇరాన్ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఉరితీసిన విషయాన్ని అధికారిక మిజాన్ వార్త సంస్థతో పాటు ఇతర వార్తా సంస్ధలు కూడా ధ్రువీకరించాయి. కాని ఎప్పుడు ఉరితీశారన్న విషయాన్ని పేర్కొనలేదు. మరణ శిక్షలు విధించడంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఇరాన్ ఉన్నప్పటికీ ఈ విధంగా సామూహికంగా ఉరితీసిన సంఘటనలు అరుదు. అంతకుముందు 2007లో ఒకసారి సామూహిక ఉరిశిక్షలను ఇరాన్ అమలు చేసింది. మషాద్లో అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిని ఒకేసారి ఉరితీసింది. ఇస్లామిక్ స్టేట్ పార్లమెంట్పై జరిపిన దాడిలో 18 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి మరో 12 మందిపై విచారణ జరుగుతున్నది.
పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







