ఇరాన్:టెహ్రాన్పై దాడి కేసులో 8 మంది ఉగ్రవాదులకు ఉరి
- July 07, 2018
టెహ్రాన్ : ఇరాన్ పార్లమెంట్ పైన, ఇరాన్ మత నాయకుడు రోహుల్లా ఖోమేనీ మసోలియంóపైన 2017లో దాడి జరిపిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపునకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులను శనివారం ఉరి తీసినట్లు ఇరాన్ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఉరితీసిన విషయాన్ని అధికారిక మిజాన్ వార్త సంస్థతో పాటు ఇతర వార్తా సంస్ధలు కూడా ధ్రువీకరించాయి. కాని ఎప్పుడు ఉరితీశారన్న విషయాన్ని పేర్కొనలేదు. మరణ శిక్షలు విధించడంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఇరాన్ ఉన్నప్పటికీ ఈ విధంగా సామూహికంగా ఉరితీసిన సంఘటనలు అరుదు. అంతకుముందు 2007లో ఒకసారి సామూహిక ఉరిశిక్షలను ఇరాన్ అమలు చేసింది. మషాద్లో అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిని ఒకేసారి ఉరితీసింది. ఇస్లామిక్ స్టేట్ పార్లమెంట్పై జరిపిన దాడిలో 18 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి మరో 12 మందిపై విచారణ జరుగుతున్నది.
పేర్కొంది.
తాజా వార్తలు
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!







