గుండెపోటుతో మృతి చెందిన కమెడియన్
- July 09, 2018
టీవీ నటుడు, కమెడియన్ కవి కుమార్ ఆజాద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్రాజ్ హాతి క్యారెక్టర్తో కుమార్ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం తీవ్రంగా గుండె పోటు రావడంతో వోక్హార్డ్ ఆసుపత్రిలో చేరిన కుమార్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆరోగ్యం బాలేకపోయినా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉండేవాడు. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి ఆసుపత్రికి వెళుతున్నానని, షూటింగ్కి రాలేనని చెప్పాడు. అయితే కొద్ది సేపటికే అతడు మరణించిన వార్త వినడం బాధకు గురిచేసిందని షో ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మేలా. ఫంతూష్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ కవి కుమార్ నటించాడు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







