గుండెపోటుతో మృతి చెందిన కమెడియన్
- July 09, 2018
టీవీ నటుడు, కమెడియన్ కవి కుమార్ ఆజాద్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోలో డాక్టర్ హన్స్రాజ్ హాతి క్యారెక్టర్తో కుమార్ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం తీవ్రంగా గుండె పోటు రావడంతో వోక్హార్డ్ ఆసుపత్రిలో చేరిన కుమార్ చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఆరోగ్యం బాలేకపోయినా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా ఉండేవాడు. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి ఆసుపత్రికి వెళుతున్నానని, షూటింగ్కి రాలేనని చెప్పాడు. అయితే కొద్ది సేపటికే అతడు మరణించిన వార్త వినడం బాధకు గురిచేసిందని షో ప్రొడ్యూసర్ అసిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మేలా. ఫంతూష్ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ కవి కుమార్ నటించాడు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







