ఏపీఏ ప్లీనరీలో పాల్గొన్న బహ్రెయిన్‌

- December 12, 2015 , by Maagulf
ఏపీఏ ప్లీనరీలో పాల్గొన్న బహ్రెయిన్‌
8వ ఆసియన్‌ పార్లమెంటరీ అసెంబ్లీ (ఏపీఏ) ప్లీనరీ సెషన్‌లో బహ్రెయిన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంది. కంబోడియన్‌ రాజధానిలో జరిగిన ఈ ప్లీనరీలో శాంతి, సంయమనం, సయోధ్య వంటి అంశాలపై చర్చలు జరిగాయి. డిసెంబర్‌ 7 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం జరిగింది. బహ్రెయినీ శాంతి బృందానికి ఎంపీ అబ్బాస్‌ అల్‌ మధి నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేసే దిశగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిరియా మరియు ఇరాక్‌లో తలెత్తిన అశాంతి, మసీదులు ఇతర ప్రార్ధనా మందిరాల విధ్వంసాన్ని ఈ ప్లీనరీ ఖండించింది. ఫౌద్‌ అహ్మద్‌ అల్‌ హజి, మహమ్మద్‌ ఇస్మాయిల్‌ అల్‌ అమాది, మహ్మద్‌ అలి అల్‌ ఖాజాయ్‌, అబ్దుల్‌ అజీజ్‌ హస్సన్‌ అబ్దుల్‌ మరియు అహ్మద్‌ అబ్దుల్‌వాహెద్‌ ఖరాతా తదితర ఎంపీలు ఈ ప్లీనరీలో పాల్గొన్నారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com