ఏపీఏ ప్లీనరీలో పాల్గొన్న బహ్రెయిన్
- December 12, 2015
8వ ఆసియన్ పార్లమెంటరీ అసెంబ్లీ (ఏపీఏ) ప్లీనరీ సెషన్లో బహ్రెయిన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంది. కంబోడియన్ రాజధానిలో జరిగిన ఈ ప్లీనరీలో శాంతి, సంయమనం, సయోధ్య వంటి అంశాలపై చర్చలు జరిగాయి. డిసెంబర్ 7 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం జరిగింది. బహ్రెయినీ శాంతి బృందానికి ఎంపీ అబ్బాస్ అల్ మధి నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేసే దిశగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిరియా మరియు ఇరాక్లో తలెత్తిన అశాంతి, మసీదులు ఇతర ప్రార్ధనా మందిరాల విధ్వంసాన్ని ఈ ప్లీనరీ ఖండించింది. ఫౌద్ అహ్మద్ అల్ హజి, మహమ్మద్ ఇస్మాయిల్ అల్ అమాది, మహ్మద్ అలి అల్ ఖాజాయ్, అబ్దుల్ అజీజ్ హస్సన్ అబ్దుల్ మరియు అహ్మద్ అబ్దుల్వాహెద్ ఖరాతా తదితర ఎంపీలు ఈ ప్లీనరీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







