రియాద్ లో వ్యక్తి హత్య కేసు..ఐదుగురిని ఉరితీశారు
- July 17, 2018రియాద్: వేర్హౌజ్ గార్డు హత్య కేసులో దోషులను సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరితీసింది. ఐదుగురిలో ఇద్దరు సౌదీ అరేబియా దేశస్థులు కాగా..ముగ్గురు చాద్ దేశస్థులున్నారు. ఐదుగురు వ్యక్తులు జెడ్డాలో పాకిస్థాన్ వేర్హౌజ్ గార్డుపై దాడి చేసి..అతని మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో గార్డు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి అరస్టైన ఐదుగురు దోషులను ఉరి తీశామని సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సాదీలో సాధారణంగా ఉరిశిక్ష బహిరంగంగా అమలు చేస్తుంటారు. అయితే దోషులు ఎక్కడ, ఎప్పుడు ఈ నేరం చేశారు.. వారిని ఎక్కడ ఉరితీశారనే విషయంపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 2018లో సౌదీ ప్రభుత్వం 64 మందికి ఉరిశిక్ష అమలు చేసింది. 2017లో 122 మంది, 2016లో 144 మందిని ఉరితీసింది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!