పేస్ట్‌ రూపంలో బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు

- July 22, 2018 , by Maagulf
పేస్ట్‌ రూపంలో బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు

బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలంబో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దగ్గర్నుంచి 1.12 కిలోల బంగారం, 1.85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com