చై-సామ్ సినిమా షురూ
- July 22, 2018
చై-సామ్ సినిమా మొదలైంది అతిథిగా విచ్చేసిన నాగార్జున హైదరాబాద్: ఎనిమిదేళ్ల క్రితం అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా 'ఏమాయ చేశావె' సినిమా వచ్చింది. ఈ సినిమాతోనే ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. 2017లో వీరిద్దరూ వివాహబంధంతో ఒకటయ్యారు. మధ్యలో 'మనం', 'ఆటోనగర్ సూర్య' సినిమాల్లోనూ జంటగా నటించారు. అయితే పెళ్లయ్యాక చై, సామ్లు కలిసి ఎప్పుడు నటిస్తారా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వారి ఆశ నెరవేరింది. శివ నిర్వాణ ఈ జంట కోసం ఓ కథను సిద్ధం చేశారు. కాగా..ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య, సమంతతో పాటు నాగార్జున కూడా వచ్చారు. ఈరోజు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి కానీ ఆగస్ట్ నుంచి చిత్రీకరణ మొదలు కానుందని సమంత వెల్లడించారు. ఇందులో చై, సామ్ భార్యాభర్తల పాత్రల్లోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది. సాహి గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పెళ్లయ్యాక భార్యభర్తల మధ్య చోటుచేసుకునే చిలిపి తగాదాలు, వాళ్ల అనుబంధం నేపథ్యంలో సాగబోతోంది. మరోపక్క చైతూ 'సవ్యసాచి', 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.
సమంత 'యూటర్న్' చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







