ఘనంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

- July 24, 2018 , by Maagulf
ఘనంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను, ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. ఇందుకోసం 40 టన్నుల వరకూ కూరగాయలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతీ ఏడాది ఆషాడంలో ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు జరుపుతుంటారు. వివిధ కూరగాయాలతో అలకరించబడిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com