ట్రాఫిక్ సేఫ్టీ డ్రైవ్ చేపట్టిన షార్జా పోలీస్
- December 13, 2015
వారాంతాల్లో పెరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి షార్జా పోలీస్ 'స్పెషల్ డ్రైవ్' చేపట్టింది. ఈ స్పెషల్ డ్రైవ్లో వాహనదారుల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహనను పెంచనున్నారు. నేటి నుంచి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది. అలాగే, రోడ్లపై వాహనాలతో ఆటలు ఆడేవారిని, అతివేగంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి చట్ట పరంగా తగిన చర్యలు తీసుకుంటామని షార్జా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ మరియు పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ షవాప్ అబ్దుల్ రెహమ్మాన్ చెప్పారు. 2015లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగాయనీ, ఈ ప్రమాదాల్లో చాలామంది చనిపోయారనీ, 2014తో పోల్చి చూస్తే ఈ ప్రమాదాలు చాలా ఎక్కువని పోలీసులు అన్నారు. వారాంతాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా షార్జా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతి వేగం, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ ప్రమాదాలకు కారణమని షార్జా పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







