టాలీవుడ్ సోగ్గాడి విగ్రహావిష్కరణ!
- December 13, 2015
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రముఖ దివంగత సీనియర్ నటుడు శోభన్బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శోభన్బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు,ఎంపీ మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభన్బాబు మంచి క్రమశిక్షణ ఉన్న నటుడన్నారు. శోభన్బాబుతో తనకున్న అనుబధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో నటించడం మానేసి పదేళ్లయినా..మరణించినా ఆయనను మరిచిపోలేని అభిమానులుండటం ఎంతో గొప్ప విషయమన్నారు. టాలీవుడ్ సోగ్గాడిగా పేరొందిన శోభన్బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









