ఈ నెల 29న 'గీత గోవిందం' ఆడియో విడుదల
- July 26, 2018
విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న జంటగా సోలో ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో రాబోతున్న చిత్రం గీత గోవిందం. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఓ రేంజ్ పెరిగిందనడానికి ఇటీవల వచ్చిన గీత గోవిందం టీజర్స్ కు వ్యూస్ చెపుతున్నాయి. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణం లో ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ ఆడియో వేడుకకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. ఈ చిత్రానికి గోపిసుందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇంకేం కావాలి అంటూ గోపీసుందర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. దీంతో గీత గోవిందం సాంగ్స్ అదిరిపోయాయని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు నటిస్తుండగా, శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ తర్వాత పరుశురాం నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి.
ప్రొడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA2 PICTURES బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!