సైబీరియాలో హెలికాప్టర్ కూలి మృతిచెందిన 18 మంది
- August 04, 2018
రష్యాకు చెందిన హెలికాప్టర్ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంఐ-8 హెలికాప్టర్ ఈ రోజు ఉదయం ఆయిల్ స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని రష్యా రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మరో హెలికాప్టర్ మోసుకొస్తున్న పరికరాలకు తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. మరో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







