కరామాలో 700,000 దిర్హామ్‌ల దోపిడీ

- December 14, 2015 , by Maagulf
కరామాలో 700,000 దిర్హామ్‌ల దోపిడీ

దుబాయ్‌ పోలీసులు 700,000 దిర్హామ్‌ల దోపిడీ కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కరామాలోని మనీ ఎక్స్‌ఛేంజ్‌ కార్యాలయం వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్‌ఛేంజ్‌లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్‌ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్‌లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్‌ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు.  వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్‌ఛేంజ్‌లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్‌ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్‌లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్‌ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com