ఇండోనేషియాలో భారీ భూకంపం..
- August 05, 2018
జకార్తా: ఇండోనేషియా ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఇండోనేషియాకు చెందిన లాంబోక్ దీవిలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉంది. దీంతో ఇండోనేషియా విపత్తు నిర్వహణ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వారం కిందట కూడా ఇదే దీవిలో భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కంటే కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు. ఇండోనేషియాతోపాటు చుట్టుపక్కల దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే బాలిలోనూ భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







