పుట్బాల్:1-0తేడాతో ఇరాక్పై నెగ్గిన భారత్
- August 07, 2018
అమ్మాన్: అమ్మాన్ వేదికగా జరుగుతున్న ఆసియా అండర్-16 ఛాంపియన్షిప్లో భారత పుట్బాల్ జట్టు అద్భుతం చేసింది. పుట్బాల్ చరిత్రలోనే తొలిసారి ఆసియా ఛాంపియన్ అయిన ఇరాక్ను 1-0తో ఓడించింది. పుట్బాల్లో ఏ ఫార్మాట్లోనైనా వయసు పరంగా చూసినప్పటికీ ఇరాక్పై భారత్ గెలవడం ఇదే తొలిసారి.
హోరాహోరీగా సాగిన మ్యాచ్లో చివరి నిమిషంలో భువనేశ్ హెడర్ గోల్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా, టోర్నీలో భాగంగా అంతకు ముందు జపాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 1-2తో ఒడినప్పటికీ, ఇరాక్తో జరిగిన మ్యాచ్లో భారత ప్లేయర్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగారు.
దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం అధ్బుత ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్టుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం జాతీయ జట్టు ప్రధాన కోచ్ బిబియానో ఫెర్నాండెస్ మాట్లాడుతూ ఈ విజయాన్ని ఏఐఎఫ్ఎఫ్ అకాడమీకి రాకముందు కుర్రాళ్లకు శిక్షణనిచ్చిన కోచ్లకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
తమపై నమ్మకం ఉంచిన భారత్ ఫుట్బాల్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాక్పై తొలి విజయం సాధించడంపై స్పందిస్తూ "ఫైనలైనా స్నేహపూర్వక మ్యాచైనా చివరి నిమిషంలో గోల్ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే" అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







