యూఏఈ:తొలి వారంలో ఆమ్నెస్టీ పొందిన 10,000 రెసిడెంట్స్
- August 08, 2018
యూఏఈ:యూఏఈలో ఇటీవల ప్రకటించిన ఆమ్నెస్టీ నేపథ్యంలో తొలి వారం రోజుల్లోనే 10,000 మంది రెసిడెన్స్ ఆమ్నెస్టీని వినియోగించుకున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఎఫ్ఆర్ఎ) వెల్లడించింది. ఫాలో అప్ సెక్టార్ ఆఫ్ వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఇన్ దుబాయ్ డైరెక్టర్ జనరల్ అసిస్టెంట్ బ్రిగేడియర్ జనరల్ ఖలాఫ్ అహ్మద్ అల్ ఘయిత్ మాట్లాడుతూ, మిలియన్ల మొత్తంలో జరీమానాల్ని ఈ వారంలో ఆమ్నెస్టీ కారణంగా రద్దు చేసినట్లు తెలిపారు. 3,422 వీసాల్ని రెన్యూ చేశామనీ, 2,107 స్పాన్సర్ అప్లికేషన్స్ జారీ చేయడం జరిగిందని వెల్లడించారాయన. దుబాయ్లోని అమెర్ సెంటర్స్లో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్స్ 5,500. 2,809 మంది తమ వీసాల్ని రద్దు చేసుకున్నారు. ఔట్ పాస్ లేదా తమ స్టేటస్ని మాడిఫై చేసుకోకుండానే చాలామంది తమ రెసిడెన్సీని క్యాన్సల్ చేసుకుంటున్నట్లు అల్ ఘాయిత్ చెప్పారు. జిడిఎఫ్ఆర్ఎ, అప్లికెంట్స్ తమ అప్లికేషన్లను పూర్తి చేసి జరీమానాలనుంచి తప్పించుకోవాల్సిందిగా సూచిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







