ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్న నీరవ్
- August 09, 2018
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రూ. 7 వేల దాకా టోపీ పెట్టి వెళ్లిపోయిన నీరవ్ మోడీ... ఈడీ, ఇంటెలిజెన్స్ బృందాలతో దోబూచులాడుతున్నాడు. తాజాగా అతను దుబాయిలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. కానీ అతనున్న స్థావరం గుర్తించి పట్టుకునే పక్కా సమాచారం మాత్రం చిక్కడం లేదు. దుబాయిలో ఆరా తీసే సమయానికే ఈజిప్టుకు చెక్కేసినట్టు మరో సమాచారం అందింది. దీంతో నీరవ్ జాడను కరెక్టుగా కనుక్కోవడం కష్టతరంగా మారింది. ఒకవేళ మోడీని బహిష్కరించాలని ఆయా దేశాలకు రిక్వెస్టు చేద్దామంటే అందుకు న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఈడీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









