సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!

- April 11, 2026 , by Maagulf
సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!

కువైట్: కువైట్ నేషనల్ గార్డ్ (KNG) చీఫ్ షేక్ ముబారక్ హుమూద్ అల్-జాబెర్ అల్-సబాహ్.. డ్రోన్‌ల దాడిలో గాయపడ్డ పలువురు సిబ్బందిని శుక్రవారం జాబెర్ అల్-అహ్మద్ ఆసుపత్రిలో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తమ జాతీయ విధిని నిర్వర్తించడంలో వారి ధైర్యాన్ని, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.

దేశ భద్రతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి నేషనల్ గార్డ్ సిబ్బంది అత్యంత సమర్థవంతంగా, సంసిద్ధతతో తమ విధులను నిర్వర్తిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని షేక్ ముబారక్ ఆకాంక్షించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com