త్వరలోనే ఇస్రో టీవీ: ఇస్రో ఛైర్మన్ కె.శివన్
- August 12, 2018
త్వరలో ఇస్రో టీవీ ఛానల్ రానుంది. లోక్సభ టీవీ తరహాలో ఇస్రో నుండి టీవీ ఛానల్ రానుందని ఆ సంస్థ ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ ఛానల్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా.. రానున్న మూడేళ్లలో 50కీలక ప్రాజెక్టులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది యూకేకు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ42 ద్వారా ప్రయోగించనున్నట్లు తెలిపారు. పీఎస్ఎల్వీ-సీ43 ద్వారా 30 వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్-2, డిసెంబర్లో ఆదిత్య-ఎల్1 ప్రయోగిస్తామన్నారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







