సిరియా: భారీ పేలుడుతో కూలిన భవనం..
- August 12, 2018
సిరియాలో ఆయుధ స్మగ్లర్లు మందుగుండు నిల్వ ఉంచిన భవనం భారీ పేలుడుతో కుప్పకూలి 12 మంది చిన్నారులు సహా 39 మంది చనిపోయారు. తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న ఇద్లిబ్ ప్రావిన్స్లోని సర్మదా పట్టణంలో ఈ పేలుడు సంభవించింది. ఇంకా పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియడం లేదు.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న చిట్టచివరి ప్రాంతం ఇద్లిబ్. సిరియా సాయుధ బలగాలు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోబోతున్నాయి. రష్యా, ఇరాన్ల సాయంతో సిరియా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు తిరుగుబాటు, జిహాదీ బృందాల మీద దాడులు చేపట్టి పురోగతి సాధించింది. టర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్న సర్మదా పట్టణంలో ఆదివారం కుప్పకూలిన భవనం శిధిలాలను తొలగించటానికి, చిక్కుకుపోయిన వారిని వెలికితీయటానికి.. సహాయ సిబ్బంది బుల్డోజర్లను ఉపయోగించినట్లు ఏఎఫ్పీ కరెస్పాండెంట్ తెలిపారు.
ఆ భవనంలో పౌరులు చాలా మంది ఉన్నారు. అది శిథిలాల కుప్పగా మారింది'' అని ఇద్లిబ్ సివిల్ డిఫెన్స్ బృందానికి చెందిన హాటెమ్ అబు మార్వాన్ చెప్పినట్లు ఏఎఫ్పీ పేర్కొంది. అక్కడ ఇంకా డజన్ల మంది ఆచూకీ తెలియటం తెలియటం లేదని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ చెప్పింది.
ఈ పేలుడులో చనిపోయిన మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి. ఆ భవనంలో ఉన్న ప్రజల్లో చాలా మంది జిహాదీ ఫైటర్ల కుటుంబాలకు చెందినవారని భావిస్తున్నారు. సిరియాలోని ఇతర ప్రాంతాల నుంచి ఇద్లిబ్లో తలదాచుకోవటానికి వీరు వచ్చారని చెప్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







