ఇళ్ల పట్టాలను అందజేసిన ప్రధాని..
- August 23, 2018
ప్రధాని నరేంద్రమోడీ.. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్న ఆయన… వాల్సాద్ సమీపంలోని జుజువా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జుజ్వాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షకు పైగా ఇళ్లను నిర్మించారు.
దేశంలో ప్రతి కుటుంబానికీ ఓ సొంత ఇల్లు ఉండాలని… 2022 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం వల్ల ప్రయోజనం పొందడానికి ఎలాంటి ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు. తన ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఒక రూపాయిని పంపిస్తే.. మొత్తం 100 పైసలు పేదల ఇంటికి చేరుతుందని మోడీ చెప్పారు.
మరోవైపు ధరమ్పూర్, కాప్రాడా ప్రాంతాల గిరిజనులకు నీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం జోనాఘడ్లో కొత్తగా నిర్మించిన గుజరాత్ వైద్య విద్య పరిశోధన సొసైటీ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీనగర్ చేరుకుని.. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి మోడీ హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







