ఇళ్ల పట్టాలను అందజేసిన ప్రధాని..
- August 23, 2018
ప్రధాని నరేంద్రమోడీ.. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్న ఆయన… వాల్సాద్ సమీపంలోని జుజువా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జుజ్వాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షకు పైగా ఇళ్లను నిర్మించారు.
దేశంలో ప్రతి కుటుంబానికీ ఓ సొంత ఇల్లు ఉండాలని… 2022 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం వల్ల ప్రయోజనం పొందడానికి ఎలాంటి ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు. తన ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఒక రూపాయిని పంపిస్తే.. మొత్తం 100 పైసలు పేదల ఇంటికి చేరుతుందని మోడీ చెప్పారు.
మరోవైపు ధరమ్పూర్, కాప్రాడా ప్రాంతాల గిరిజనులకు నీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం జోనాఘడ్లో కొత్తగా నిర్మించిన గుజరాత్ వైద్య విద్య పరిశోధన సొసైటీ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీనగర్ చేరుకుని.. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి మోడీ హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









