ఇళ్ల పట్టాలను అందజేసిన ప్రధాని..
- August 23, 2018
ప్రధాని నరేంద్రమోడీ.. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్న ఆయన… వాల్సాద్ సమీపంలోని జుజువా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జుజ్వాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షకు పైగా ఇళ్లను నిర్మించారు.
దేశంలో ప్రతి కుటుంబానికీ ఓ సొంత ఇల్లు ఉండాలని… 2022 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం వల్ల ప్రయోజనం పొందడానికి ఎలాంటి ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు. తన ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఒక రూపాయిని పంపిస్తే.. మొత్తం 100 పైసలు పేదల ఇంటికి చేరుతుందని మోడీ చెప్పారు.
మరోవైపు ధరమ్పూర్, కాప్రాడా ప్రాంతాల గిరిజనులకు నీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం జోనాఘడ్లో కొత్తగా నిర్మించిన గుజరాత్ వైద్య విద్య పరిశోధన సొసైటీ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీనగర్ చేరుకుని.. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి మోడీ హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







