యూ.ఏ.ఈ :స్కూల్ ఖర్చుల్లో డిస్కౌంట్ కోసం చూస్తున్న పేరెంట్స్
- August 25, 2018
యూ.ఏ.ఈ:సమ్మర్ ముగుస్తోంది. స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు మార్గాల్ని అన్వేసిస్తున్నారు. యూనిఫామ్లు, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, బుక్ బ్యాగ్స్, లంచ్ బాక్స్లను కొనుగోలు చేసే క్రమంలో డిస్కౌంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా పరిస్థితులు ఏమంత బాగా లేని ఈ పరిస్థితుల్లో స్కూల్ ఖర్చులలో తగ్గుదల కోసం ప్రయత్నిస్తున్నామని పేరెంట్స్ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి అర్చనా దేశాయ్ మాట్లాడుతూ, తమ పిల్లల్ని స్కూల్కి పంపించేందుకు 500 దిర్హామ్ల ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. యూనిఫామ్ ధరలు ఎక్కువగా వున్నాయనీ ఆమె అన్నారు. ప్రాచీ సిన్హా అనే హహిళ మాట్లాడుతూ తమ పిల్లల్ని స్కూల్కి పంపించాల్సి వుందనీ, డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పలువురు తల్లిదండ్రులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు భారంగా మారుతుండడంతో ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయనే ఆలోచనతో, డిస్కౌంట్ సేల్ కోసం ఎదురుచూస్తున్నట్లు మెజార్టీ పేరెంట్స్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







