దుబాయ్ లో ఏసెస్ రెండోసారి పరాజయం..

- December 16, 2015 , by Maagulf
దుబాయ్ లో ఏసెస్ రెండోసారి పరాజయం..

వరుస విజయాలతో జోరు మీదు న్న డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టుకు అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో రెండో పరాజయం ఎదురైంది. సింగపూర్ స్లామర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ జట్టు 16-27 గేమ్‌ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే లీగ్‌లో 257 గేమ్‌లతో లీగ్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఏసెస్ జట్టు ఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో 0-6తో కార్లోస్ మోయా చేతిలో ఓడిపోగా... మహిళల సింగిల్స్‌లో అగ్నెస్కా రద్వాన్‌స్కా (ఏసెస్) 6-3తో బెలిండా బెన్సిచ్‌పై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా-రోహన్ బోపన్న (ఏసెస్) ద్వయం 5-6తో బ్రౌన్-ప్లిస్కోవా జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో డోడిగ్-టామిక్ (ఏసెస్) జోడీ 4-6తో ఆండీ ముర్రే-మార్సెలో మెలో ద్వయం చేతిలో ఓటమి చెందగా... పురుషుల సింగిల్స్‌లో నిక్ కిరియోస్ 6-1తో బెర్నాడ్ టామిక్ (ఏసెస్)ను ఓడించి సింగపూర్ స్లామర్స్‌కు ఈ లీగ్‌లో ఆరో విజయాన్ని అందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com