లిబియా శిబిరాల్లో తిండి, నీరు లేక అలమటిస్తున్న శరణార్థులు
- August 30, 2018
ట్రిపోలి:యూరప్ చేరుకుందామని బయలుదేరిన వందలాదిమంది శరణార్ధులు లిబియాలో ప్రభుత్వ అధీనంలోని శిబిరాల్లో చిక్కుకుపోయి తినడానికి తిండి, తాగడానికి నీరు లేకుండా అలమటిస్తున్నారు. వీరిలో ఐదేళ్ళు నిండని చిన్నారులతో సహా మహిళలు పెద్ద సంఖ్యలో వున్నారు. ట్రిపోలిలో ప్రత్యర్ధి వర్గాల మధ్య పోరు ఉధృతం కావడంతో శరణార్ధులు, వలసవాదులను ఎవరూ పట్టించుకునేవారే లేరు. ట్రిపోలికి దక్షిణంగా గల ప్రభుత్వ శిబిరమైన అయిన్ జరాలో వందలాదిమంది ప్రజలు కిక్కిరిసిపోయి వున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్కర్ ఒకరు తెలిపారు. ఆ నిర్బంధ శిబిరంలో దాదాపు 400మందికి పైగా వున్నారు. వారిలో 200మంది వరకు మహిళలు, 200మందికి పైగా పురుషులు వున్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులు 20మంది వరకు వున్నారని, వీరు తిండి, నీరు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మరో మూడు శిబిరాల్లో 1500 వరకు వున్నట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో కొంతమంది పారిపోగా, మరికొంతమందిని ఇతర శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







