ప్రయాణీకులకు ఫ్లై దుబాయ్ సూచన
- December 17, 2015
ఫ్లై దుబాయ్ తమ ప్రయాణీకులు సరైన సమయంలో ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. సరైన సమయానికి రాకుండా, ఒకేసారి ప్రయాణీకులంతా ఎయిర్పోర్ట్కి చేరుకోవడంతో తాత్కాలిక రద్దీ ఏర్పడుతోందనీ, దీని ద్వారా ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతోందని ఫ్లై దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఈ వారాంతంలో 12 వేల మందికి పైగా ప్రయాణీకులు ఫ్లై దుబాయ్ విమానాల ద్వారా అమ్మాన్, బీరుట్, జెడ్డా, మస్కట్ మరియు శ్రీలంకకు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామనీ, ట్రాఫిక్ సహా అనేక ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణాలకు ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ముందస్తుగా విమానాశ్రయానికి చేరుకోవడం మంచిదని ఫ్లై దుబాయ్ అధికారులు సూచన ప్రకటన విడుదల చేశారు. గంట ముందు చెక్ ఇన్ వుంటుందనీ, ఆన్ లైన్లో చెకిన్ సౌకర్యం వున్నప్పటికీ, బ్యాగేజ్ చెకింగ్కి గంట సమయం పడుతుంది గనుక, ఫ్లైట్ డిపాచ్యూర్కి గంట ముందే, వీలైతే ఇంకా ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. హోవర్ బోర్డ్స్, బ్యాలెన్స్ వీల్స్ వంటి లిథియమ్ బ్యాటరీ వస్తువులను విమానాల్లోకి అనుమతించరు. లిక్విడ్స్, ఏరోసోల్స్ మరియు జెల్స్ పూర్తిగా రీసీల్ చేయబడ్తాయి. ప్రయాణీకులు ఇవన్నీ గుర్తించగలరు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







