రాజమండ్రిలో హీరో సూర్య ను అడ్డుకున్న అభిమానులు..
- August 31, 2018
తమిళ్ హీరో సూర్య..తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. గజని , వీడోక్కడే, సింగం ఇలా ఎన్నో హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల 24 తో ప్రశంసలు అందుకున్న ఈయన..ప్రస్తుతం ఎన్ జీకే అనే సినిమా చేస్తున్నాడు. 7/జి బృందావన్ కాలనీ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వం లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు వచ్చారు. తనకోసం వచ్చారని తెలుసుకున్న సూర్య కార్ వ్యాన్ దిగి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించి,అభిమానులతో సెల్ఫీలు దిగారు.
సూర్యకి రాజమండ్రిలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చిత్ర యూనిట్ షాక్ అయ్యారట. సెక్యూరిటీ కూడా అభిమానులని అదుపు చేయలేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసినట్టు దర్శకుడు తన బ్లాగ్ ద్వారా తెలియజేశాడు. ఈ చిత్రంలో సూర్య కు జోడిగా రకుల్ ప్రీత్సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







