ప్రధాని మోడీ హత్యకు కుట్ర...
- August 31, 2018
రాజీవ్ హత్య తరహాలో ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారా..? కామ్రెడ్లు కమ్యూనికేషన్ కోసం రాసిన లేఖల్లో ఏముంది..? బీమా కోరేగావ్ అల్లర్ల వెనుక కుట్ర దాగుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతున్నారు పుణె పోలీసులు. ఇటీవల పౌర హక్కుల నేతల అరెస్ట్ దేశంలో తీవ్ర సంచలనం రేపిన నేపథ్యంలో పుణె పోలీసులు చెబుతున్న మాటలు మరింత సంచలనంగా మారాయి.
మహారాష్ట్ర పోలీసులు చెబుతున్న మాటలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎలాగైతే హత్యచేశారో, అదే తరహాలో మోడీ రాజ్ ను అంతం చేయాలనుకున్నారని సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ ఆరోపణలకు సాక్ష్యాధారాలను కూడా జోడించారు. కామ్రెడ్లు కమ్యూనికేషన్ కోసం రాసిన లేఖను విడుదల చేశారు. తాము జరిపిన దర్యాప్తులో మావోయిస్టు ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి పెద్ద కుట్ర పన్నినట్టు తెలిసిందన్నారు.
భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి.. 2017 డిసెంబర్ 31న కొందరు విద్వేష ప్రసంగాలు చేశారని.. తర్వాత పరిస్థితుల్లో నిందితులపై జనవరి 8న కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు మహారాష్ట్ర ADG పరమ్ బీర్ సింగ్. విద్వేషం చిమ్మినవారిపై ఆయా సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది కబీర్ కాలా మంచ్ కు చెందినవారే అని అన్నారు. మావోయిస్టు ఆర్గనైజేషన్స్ తో కలిసి నిందితులు పావులు కదిపారని చెప్పారు. ఇందులో ఓ టెర్రర్ గ్రూప్ కూడా ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. నిందితులపై మే 17న UAPA కింద కేసులు పెట్టామన్నారు.
పౌర హక్కుల నేత రోనా విల్సన్ కామ్రేడ్ ప్రకాశ్ కు రాసిన లేఖను చదివి వినిపించారు పీబీ సింగ్. కిషన్తో పాటు ఇతర కామ్రేడ్లు మోడీ ప్రభుత్వ అంతం కోసం చర్యలు చేపట్టారని, గ్రనేడ్ లాంచర్ల సప్లై కోసం ఏడాదికి 8 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని రోనా విల్సన్ .. కామ్రేడ్ ప్రకాశ్ ను కోరారని పోలీసులు చెప్పారు. ఈ లేఖల ఆధారంగానే దర్యాప్తు జరిపి.. స్పష్టమైన ఆధారాలు లభించాకే.. మహారాష్ట్ర పోలీసులు.. పలు పట్టణాల్లో సోదాలు జరిపి అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్టు చేశారని చెప్పారు పీబీ సింగ్. ఈ నేతల్లో విరసం రచయిత వరవరరావు కూడా ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







