ఆసియాకప్కు భారత జట్టు ఎంపిక..కోహ్లీ,హార్దిక్ లకు రెస్ట్
- September 01, 2018
ఆసియా కప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బీసిసిఐ ఇవాళ ప్రకటించింది. బిజీ షెడ్యూల్తో కెప్టెన్ విరాట్కోహ్లీకి విశ్రాంతినిచ్చి… రోహిత్శర్మకు జట్టు పగ్గాలు అప్పగించారు. వచ్చే ప్రపంచకప్ వరకూ తీరికలేని షెడ్యూల్ ఉన్న కారణంగా విరాట్కు రెస్ట్ ఇచ్చినట్టు తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగుతేజం అంబటి రాయుడుకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఇటీవలే యోయో టెస్ట్ పాసవడంతో రాయుడుకు చోటు దక్కింది.
అలాగే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తోన్న మనీశ్పాండే, కేదార్ జాదవ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు రాజస్థాన్ యువ పేసర్ ఖలీల్ అహ్మద్ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ధోనీతో పాటు మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా స్టాండ్బైగా ఎంపికయ్యాడు. ఆల్రౌండర్గా హార్థిక్ పాండ్యా చోటు నిలుపుకోగా… స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చహల్,అక్షర్ పటేల్, కుల్దీప్యాదవ్ ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 15 నుంచి యుఎఇ వేదికగా ఆసియాకప్ జరగనుంది. భారత్,పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లతో పాటు మరో క్వాలిఫైయిర్ టీమ్ ఆడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్,పాక్ సెప్టెంబర్ 19న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
భారత జట్టు:
రోహిత్శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, అంబటిరాయుడు,మనీశ్ పాండే,కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ( వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్,హార్థిక్ పాండ్యా,కుల్దీప్ యాదవ్, యజ్వేంద్రచహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్,జస్ప్రీత్ బూమ్రా, శార్థూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







