న్యూఢిల్లీని వణికిస్తున్న అకాల వర్షాలు..
- September 01, 2018
న్యూఢిల్లీ:ఇన్నాళ్లూ కేరళలో బీభత్సం సృష్టించిన భారీవర్షాలు.. ఇప్పుడు దేశరాజధానిని వణికిస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
ఢిల్లీలో కురుస్తున్న అకాల వర్షాలతో.. ఐరన్ బ్రిడ్జి దగ్గర నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. యమునా మార్గ్, ఎంజీఎం రింగ్రోడ్ సహా వికాస్మార్గ్లోని ఐపీ బ్రిడ్జి ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరడంతో.. ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. పలు రూట్లలో ట్రాఫిక్ను పోలీసులు దారి మళ్లించారు. ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షం కారణంగా.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇప్పటికే ఢిల్లీలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు.. ట్రాఫిక్ అలెర్ట్ ప్రకటించారు. మరో 24 గంటల గడిస్తే తప్ప.. వర్షం తీవ్రతను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీలోని ప్రధాన కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







