న్యూఢిల్లీని వణికిస్తున్న అకాల వర్షాలు..
- September 01, 2018
న్యూఢిల్లీ:ఇన్నాళ్లూ కేరళలో బీభత్సం సృష్టించిన భారీవర్షాలు.. ఇప్పుడు దేశరాజధానిని వణికిస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
ఢిల్లీలో కురుస్తున్న అకాల వర్షాలతో.. ఐరన్ బ్రిడ్జి దగ్గర నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. యమునా మార్గ్, ఎంజీఎం రింగ్రోడ్ సహా వికాస్మార్గ్లోని ఐపీ బ్రిడ్జి ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరడంతో.. ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. పలు రూట్లలో ట్రాఫిక్ను పోలీసులు దారి మళ్లించారు. ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షం కారణంగా.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇప్పటికే ఢిల్లీలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు.. ట్రాఫిక్ అలెర్ట్ ప్రకటించారు. మరో 24 గంటల గడిస్తే తప్ప.. వర్షం తీవ్రతను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీలోని ప్రధాన కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







