బ్యాంక్ వినియోగదారుల్ని దోచుకున్న ఇద్దరి అరెస్ట్
- September 06, 2018
మస్కట్: అరబ్ జాతీయులు ఇద్దరు, బ్యాంక్ కస్టమర్ల వద్ద నుంచి డబ్బుని దొంగిలిస్తున్న అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. పెద్ద మొత్తంలో డబ్బుని బ్యాంకు నుంచి 'విత్ డ్రా' చేసే వినియోగదారుల్ని గుర్తించి, వారిని ఫాలో అవుతూ, వారు ఆగగానే దొంగతనానికి పాల్పడటం నిందితులకు వెన్నతో పెట్టిన విద్య. వాహన అద్దాలు పగలగొట్టి, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుల గురించి పోలీసులు చెప్పారు. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఇద్దర్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ తెలిపారు. పౌరులు, నివాసితులు బ్యాంకుల నుంచి డబ్బుల్ని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, డబ్బును తమ కార్లలో వదిలిపెట్టడం, భద్రత లేకుండా వుంచడం చేయకూడదని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







