తెలంగాణలో ఎన్నికల విషయంలో.. ఊహాగానాలు నమ్మవద్దు:రావత్‌

- September 07, 2018 , by Maagulf
తెలంగాణలో ఎన్నికల విషయంలో.. ఊహాగానాలు నమ్మవద్దు:రావత్‌

తెలంగాణ:రద్దయిన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారించింది సీఈసీ. తెలంగాణలో ఎన్నికల విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, రాజ్యాంగపరంగా ముందుకెళతామనీ ప్రధాన కమిషనర్‌ రావత్‌ అన్నారు. ఎలాంటి ఊహాగానాలు నమ్మవద్దని సూచించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు ఎన్నికల నిర్వహణపై సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఈ భేటీకి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ హాజరవుతారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాలపై చర్చ జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com