దివాలీకి ప్రత్యేక స్టాంపు ను విడుదల చేయనున్న 'యుఎన్ఓ'
- September 10, 2018
హిందువులకు అతి పవిత్రమైన, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. సంతోషానికి, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆనందంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా అక్టోబర్ 19న 'హ్యాపీ దీవాలీ' పేరుతో స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనను స్వాగతించారు. 'ఇది రానున్న దీవాలీకి పసందైన బహుమతి' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో దీపావళి వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి