దివాలీకి ప్రత్యేక స్టాంపు ను విడుదల చేయనున్న 'యుఎన్ఓ'
- September 10, 2018
హిందువులకు అతి పవిత్రమైన, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. సంతోషానికి, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆనందంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా అక్టోబర్ 19న 'హ్యాపీ దీవాలీ' పేరుతో స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనను స్వాగతించారు. 'ఇది రానున్న దీవాలీకి పసందైన బహుమతి' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో దీపావళి వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







