దివాలీకి ప్రత్యేక స్టాంపు ను విడుదల చేయనున్న 'యుఎన్ఓ'
- September 10, 2018
హిందువులకు అతి పవిత్రమైన, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను పురస్కరించుకుని వచ్చే నెల ఐక్యరాజ్య సమితి పోస్టల్ ఏజెన్సీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. సంతోషానికి, వెలుగులకు చిహ్నమైన దీపావళి పండుగను భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆనందంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా అక్టోబర్ 19న 'హ్యాపీ దీవాలీ' పేరుతో స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ ప్రకటనను స్వాగతించారు. 'ఇది రానున్న దీవాలీకి పసందైన బహుమతి' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో దీపావళి వేడుకలను పెద్దఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









