తెలంగాణ:కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీర్మానాలు ఇవే..
- October 06, 2018
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ''అక్టోబర్ 9లోగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలి. 14 నాటికి అభ్యర్థుల జాబితా ప్రకటించాలి. డిపాజిట్ కోల్పోయిన వారికి టికెట్ ఇవ్వొద్దు. రెండుసార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వొద్దు. విశ్వసనీయత, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలోనే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి హైకమాండ్కు లిస్టు పంపాలి. గెలిచే స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవద్దు. గెలుపు ప్రామాణికంగా పొత్తులు ఉండాలి.'' అని కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో సీపీఐకి ఇచ్చే సీట్లపై కూడా చర్చించారు. ఖమ్మంలో సీపీఐకి స్థానాలు ఇవ్వొద్దని నిర్ణయించారు. గత ఎన్నికల్లో సీపీఐకి మూడు స్థానాలు ఇస్తే డిపాజిట్ రాలేదని ఈ సమావేశంలో గుర్తు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







