ఎన్నికల్లో అసత్య ప్రచారానికి చెక్ పెట్టనున్న ఫేస్బుక్
- October 06, 2018
దిల్లీ: లోక్సభ ఎన్నికల సమయంలో తమ సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా ఫేస్బుక్ జాగ్రత్త చర్యలు చేపట్టింది. వందల మందితో కలిసి తమ వేదిక ద్వారా ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. అసత్య ప్రచారం, అశ్లీల మాటలు వ్యాప్తికాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. '2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు, నిపుణుల బృందాలను ఒక్క చోటకు చేర్చబోతున్నాం' అని ఫేస్బుక్ అధికారి రిచర్డ్ అల్లీస్ మీడియాకు తెలిపారు.
'మా బృందంలో సెక్యూరిటీ నిపుణులు, సమాచార నిపుణులు, ఇతరులు ఉంటారు. భారత్లో ఎన్నికలకు సంబంధించిన వేర్వేరు రూపాల్లో వచ్చే అసత్య ప్రచారాన్ని వీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వాస్తవ రాజకీయ వార్తలు, రాజకీయ ప్రచారానికి తేడాను కనిపెట్టడమే మా కార్యదళానికి ఉన్న అసలైన సవాల్. ఇప్పటికే సంస్థలో పని చేస్తున్న వారినే కాకుండా కొత్త వారినీ ఇందుకోసం నియమించుకుంటాం' అని ఆయన వెల్లడించారు.
హింసకు సంబంధించిన అసత్య వార్తలను తనిఖీ చేసేందుకు ఒక బృందం, ఇతర అసత్య సమాచారాన్ని తనిఖీ చేసేందుకు మరో నిజనిర్ధారణ బృందం పనిచేస్తాయని అలన్ వెల్లడించారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ను గెలిపించేందుకు ఫేస్బుక్ వేదికగా గుర్తుతెలియని వారు భారీ ఎత్తున అసత్య ప్రచారం చేపట్టారన్న వార్తలు రావడంతో ఫేస్బుక్ సీఈవో మార్క్జుకర్ బర్గ్ సైతం సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ వేదిక సాయం చేయాలని కోరుకుంటున్నామని అలన్ పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్, మెక్సికో, అమెరికా మిడ్టర్మ్ ఎన్నికల్లో ఫేస్బుక్ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







