'ప్రవాసిమిత్ర' అవార్డుల ప్రదానం
- December 19, 2015
అంతర్జాతీయ వలసవాదుల దినోత్సవ వేడుకలు 'మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్' ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ ఉపాధ్యక్షుడు భీమ్రెడ్డి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ,యు.ఏ.ఈ అడ్వకేట్ ఓబ్బిలిసెట్టి అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వున్నారనీ, వారి బాగోగుల గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. తెలగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు సహాయం చేస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి, వారికి ప్రతి యేడాదీ అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసి మిత్ర అవార్డుల్ని అందజేస్తుంది మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ సంస్థ. ఈ సారి శాంతి ప్రియ (మలేఇఃసయా), రాంరెడ్డి యేళ్ళ (సింగపూర్), గంగాధర్ గడ్డం (దుబాయి), గిరీష్ సంత్ (దుబాయి), శరత్ యలమర్తి (షార్జా)లకు జీవన్రెడ్డి ప్రవాసి మిత్ర అవార్డులతో సత్కరించారు.
మాగల్ఫ్.కామ్ తరుపున అవార్డు గ్రహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







