'ప్రవాసిమిత్ర' అవార్డుల ప్రదానం
- December 19, 2015
అంతర్జాతీయ వలసవాదుల దినోత్సవ వేడుకలు 'మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్' ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ ఉపాధ్యక్షుడు భీమ్రెడ్డి అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ,యు.ఏ.ఈ అడ్వకేట్ ఓబ్బిలిసెట్టి అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వున్నారనీ, వారి బాగోగుల గురించి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. తెలగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు సహాయం చేస్తున్న స్వచ్ఛంద సేవకులను గుర్తించి, వారికి ప్రతి యేడాదీ అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసి మిత్ర అవార్డుల్ని అందజేస్తుంది మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ సంస్థ. ఈ సారి శాంతి ప్రియ (మలేఇఃసయా), రాంరెడ్డి యేళ్ళ (సింగపూర్), గంగాధర్ గడ్డం (దుబాయి), గిరీష్ సంత్ (దుబాయి), శరత్ యలమర్తి (షార్జా)లకు జీవన్రెడ్డి ప్రవాసి మిత్ర అవార్డులతో సత్కరించారు.
మాగల్ఫ్.కామ్ తరుపున అవార్డు గ్రహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







