'అమరావతి'లో 'డిక్టేటర్' ఆడియో కార్యక్రమం..
- December 20, 2015
సినీ నటుడు బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమాన్ని ఏపీ రాజధాని 'అమరావతి'లో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆడియో కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిమానులు భారీగా అమరావతికి తరలివెళుతున్నారు. చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంతం నుండి రెండు బస్సుల్లో ఆ ప్రాంతానికి వెళుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య అభిమానులు 99 కారుల్లో రాజధాని ప్రాంతానికి పయనమవుతున్నారు. వీరితో పాటు నటుడు బాలయ్య కూడా బస్సులో వెళుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. 'లౌక్యం'వంటి బ్లాక్బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







