కైరోలో ఐసీస్ టెర్రరిస్టుల కాల్పులు..

- November 02, 2018 , by Maagulf
కైరోలో ఐసీస్ టెర్రరిస్టుల కాల్పులు..

 

ఈజిప్టు రాజధాని కైరోలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. క్రైస్తవుల బృందం ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి. మిన్యా సిటీకి సమీపంలో ఉన్న సెయింట్ సామ్యుల్ కాప్టిక్ క్రిస్టియన్ మానెస్టరీ నుంచి బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐసీస్ ప్రకటన విడుదల చేసింది. అయితే దాడికి గల కారణాన్ని ఐసీస్ వెల్లడించలేదు. ఈ దారుణ ఘటనను ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్డెల్ ఫటాహ్ ఖండించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com