ఇండియాలో అరెస్ట్ అయిన ఒమనీయులు స్వదేశానికి..
- November 04, 2018మస్కట్: చిన్న వయసు బాలికల్ని పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఒమనీయులు ఎట్టకేలకు స్వదేశానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అయ్యింది. చాలా రోజులుగా హైద్రాబాద్లోనే చిక్కుకపోయిన తమవారు, స్వదేశానికి వస్తున్నందున వారి కోసం భారీ స్వాగత ఏర్పాట్లు చేశామని ఐదుగురు ఒమనీయుల కుటుంబాలకు చెందినవారు అంటున్నారు. ఏడాదికి పైగా ఈ ఐదుగురు ఒమనీయుల్ని హైద్రాబాద్లో నిలువరించడం జరిగింది. హసన్ అల్ కాసిమి, హబీబ్ అల్ మహాహీ, తలిబ్ అల్ సాల్హి, జుమా అల్ ఒబైదని, నాజర్ అల్ సాల్హి అరెస్టయిన ఐదుగురు వ్యక్తులు. గత సెప్టెంబర్లో వీరిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమను తాము మెడికల్ టూరిస్టులుగా అరెస్టయిన వ్యక్తులు పేర్కొనడం జరిగింది. అక్టోబర్లో, వీరిని నిర్దోషులుగా భారత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతకుముందు జూన్లో ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డెలిగేషన్, ఈ ఐదుగురు ఒమనీయులకు న్యాయసహాయం అందించేందుకు ఇండియా చేరుకుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?