రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ళ మహిళ మృతి
- November 05, 2018షార్జా:కుమార్తెను ట్రాలర్లో వేసుకుని వెళుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, 16 నెలల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని, ఆమె తల్లిని వెంటనే అల్ కాసిమి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రోడ్ క్రాసింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో రోడ్ క్రాస్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అతి వేగం కూడా కారణమని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ