రోడ్డు ప్రమాదంలో 42 ఏళ్ళ మహిళ మృతి
- November 05, 2018
షార్జా:కుమార్తెను ట్రాలర్లో వేసుకుని వెళుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, 16 నెలల చిన్నారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరగగా, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని, ఆమె తల్లిని వెంటనే అల్ కాసిమి ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రోడ్ క్రాసింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో రోడ్ క్రాస్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు అతి వేగం కూడా కారణమని వారు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









