దుబాయ్:గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశం లో పాల్గొన్న నారా లోకేష్
- November 11, 2018
దుబాయ్:దుబాయ్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఏపీలో అనుసరిస్తున్న పరిపాలనా విధానాలను వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో తెచ్చామన్నారు. కాల్ సెంటర్ ద్వారా ప్రజల సంతోష సూచిక తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకుంటున్నామని వివరించారు. అధునాతన టెక్నాలజీ అమలు చెయ్యడంలో ముందున్నామన్నారు. వివిధ శాఖల పనితీరు రియల్ టైంలో తెలుసుకునేలా డ్యాష్ బోర్ట్ ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







