ఆఫ్గనిస్తాన్ లో మానవబాంబు..43 మంది మృతి..
- November 21, 2018
ఆఫ్గనిస్తాన్: పచ్చని పెండ్లి మండపం. కళకళలాడుతు పెండ్లి విందులో ఆనందం అంతా మాదే అన్నట్లుగా వుండే ఆ పెండ్లి మండపం క్షణాల్లో శశ్మానంగా మారిపోయింది. నవ్వులు పూసిన చోట మృత్యువు విలయతాండవం చేసింది. మరో మారణ హోమానికి తెరతీరారు ఆత్మాహుతి దళం. అనారిక ఆలోచనలతో పచ్చని పెండ్లి మండపాన్ని శశ్మానంగా మార్చేశారు నరరూప రాక్షసులు. దేశంలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు దేశ రాజధాని కాబూల్లోని ప్రముఖ వెడ్డింగ్ హాల్ను లక్ష్యంగా చేసుకుని పాల్పడ్డ ఆత్మాహుతి దాడిలో దాదాపు 43 మంది మృతిచెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. అప్పటివరకూ సందడిగా ఉన్న హాల్ సెకన్ల వ్యవధిలో మృతులదిబ్బగా మారిపోయింది. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటిపోయాయి.
ఇస్లాం మత ప్రవక్త మహ్మద్ జయంతి సందర్భంగా కాబూల్లోని వెడ్డింగ్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 40 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కాబూల్ పోలీసు అధికారి బషిర్ ముజాహిద్ వెల్లడించారు. కాబూల్లోని విమానాశ్రయం రోడ్డులో ఉన్న ఉర్నాస్ వెడ్డింగ్ హాల్ను లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







