వెడ్డింగ్ హాల్: 40 మందిని బలిగొన్న మానవబాంబు
- November 21, 2018
అఫ్గనిస్థాన్ : పచ్చని పెండ్లి మండపం. కళకళలాడుతు పెండ్లి విందులో ఆనందం అంతా మాదే అన్నట్లుగా వుండే ఆ పెండ్లి మండపం క్షణాల్లో శశ్మానంగా మారిపోయింది. నవ్వులు పూసిన చోట మృత్యువు విలయతాండవం చేసింది. మరో మారణ హోమానికి తెరతీరారు ఆత్మాహుతి దళం. అనారిక ఆలోచనలతో పచ్చని పెండ్లి మండపాన్ని శశ్మానంగా మార్చేశారు నరరూప రాక్షసులు. దేశంలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు దేశ రాజధాని కాబూల్లోని ప్రముఖ వెడ్డింగ్ హాల్ను లక్ష్యంగా చేసుకుని పాల్పడ్డ ఆత్మాహుతి దాడిలో దాదాపు 40 మంది మృతిచెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. అప్పటివరకూ సందడిగా ఉన్న హాల్ సెకన్ల వ్యవధిలో మృతులదిబ్బగా మారిపోయింది. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటిపోయాయి.
ఇస్లాం మత ప్రవక్త మహ్మద్ జయంతి సందర్భంగా కాబూల్లోని వెడ్డింగ్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 40 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కాబూల్ పోలీసు అధికారి బషిర్ ముజాహిద్ వెల్లడించారు. కాబూల్లోని విమానాశ్రయం రోడ్డులో ఉన్న ఉర్నాస్ వెడ్డింగ్ హాల్ను లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







